బాంబ్ షెల్ – The End

కాశ్మీర్ లో ప్రెసిడెంట్ రుల్ ఉంది…పార్లమెంట్ సమావేశాలు ఇంకా కాలేదు….ఈలోగా అక్కడ మూక దాడులు మొదలు పెట్టారు అజాద్ కాశ్మీర్ అంటూ… పార్లమెంట్ లో భారతీయ ప్రజా పార్టీ నాయకులు దీన్ని ప్రస్తావించారు…”మేము ఎప్పడినుండో చెప్తున్నాం ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని…ఈ అజాద్ కాశ్మీర్ అనే వారికి అదే దెబ్బ…”అన్నాడు వాళ్ళ లీడర్.. రామ్ కుమార్ లేచి నిలబడ్డాడు..”అధ్యక్షా ,, మనం 370 రద్దు చేస్తే ,,పాకిస్తాన్ తన వద్ద ఉన్న అజాద్ కాశ్మీర్ ను కలిపేసుకుంటే అప్పుడు మనం ఏమి చేయాలి….మనం తీర్మానం చేసుకున్నాము మొత్తం కాశ్మీర్ మనదే అని”అని చెప్పారు… +++++ అదే టైమ్ కి పాక్ పీఎం ప్రకటించాడు “నేను త్వరలో ఇండియా పీఎం తో శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నాను….యుద్దానికి మేము సిద్దం”అన్నాడు…. (++++

ఆ సాయంత్రం సౌందర్య పీఎం ఇంటికి వచ్చింది మినిస్టర్ తో కలిసి.. పార్టీ వారు,మినిస్టర్ లు కూడా ఉన్నారు మీటింగ్ లో… సుమతి లేనపుడు అడిగింది రజియా “ఏమంటోంది విద్య మాడం”… సౌందర్య “మీకు తెలుసు అని నాకు తెలుసు,,ఆవిడ పీఎం కి చెడ్డ పేరు రాకుండా రీప్లేస్ అవ్వలనుకుంటోంది…”అంది.. రజియా “నేను చాలా కోట్లు సంపాదించాను,, హవాలా వ్యాపారులతో మాట్లాడుతున్నాను.,,నేను తప్పు కుంటాను…”అంది సౌందర్య “సో రజియా సుల్తానా కథ అయిపోయింది…అంతేగా”అంది.. “అవును కానీ వెళ్ళే ముందు ఇండియా , పాక్ రెండిటికీ మంచి చేస్తాను “అంది రజియా… సౌందర్య కి అర్థం కాలేదు…

వెళ్లి మీటింగ్ లో కూర్చున్నారు ఇద్దరు… “భారతీయ ప్రజా పార్టీ ను కట్టడి చేయాలి “అన్నాడు పార్టీ అధ్యక్షుడు… “మీకు ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ఏమిటి ప్రాబ్లెమ్ “అడిగింది రజియా.. పార్టీ వాళ్ళు చిరాగ్గా చూశారు ,,ఎప్పుడు ప్రచారానికి విద్య ను వాడుకోవడం తప్ప ఇలా సలహాలు ఇస్తే చిరాకు వస్తుంది వారికి.. “పార్లమెంట్ లో చెప్పాను కదా ,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలిపెస్తారు “అన్నాడు రామ్.. “మీకేమి పాక్ లో కలుపుకుంటే “అంది రజియా.. “అదేమిటి అది మనదే “అన్నాడు పార్టీ సెక్రెటరీ.. “ఎలా” “స్వతంత్రం వచ్చాక రాజ హరి సింగ్ జమ్ము కాశ్మీర్ మన దేశం లో కలుపుతూ ఒప్పందం చేసుకున్నారు…అప్పటికే పాక్ కొంత కబ్జా చేసుకుంది , అదే అజాద్ కాశ్మీర్ ,,దానికి ప్రెసిడెంట్,పీఎం ఉంటారు…ఆర్మీ పాక్ ది.. మనం ప్రత్యేక స్థితి ఇచ్చాము..అదే 370…అక్కడ ఎవరు బయట వారు వ్యాపారం చేయరాదు,,భూమి కొనరాదు..ఇలా చాలా ఉన్నాయి…ఐపిసి కూడా ఉండదు..”అన్నాడు పీఎం రామ్.. రజియా టీ తాగుతూ “అయితే ఎవరికి ఉపయోగం”అంది… ఎవరు మాట్లాడలేదు,,చిరాగ్గా చూశారు.. “ఇప్పుడు శిఖరాగ్ర సదస్సులో ఏమి మాట్లాడుకుంటారు ఇద్దరు “అడిగింది మళ్లీ.. “కాశ్మీర్ గురించి “అన్నాడు పీఎం.. “అదే ఏముంది మాట్లాడడానికి “అడిగింది రజియా.. ఎవరు మాట్లాడలేదు…”విద్య,వ్యాపారం,వైద్యం ఇలా దేని గురించి మాట్లాడు కొరు….కేవలం కాశ్మీర్ ,,,రెండు దేశాలకి పని లేదా”అంది రజియా వెటకారం గా.. “అంటే కాశ్మీర్ ఇష్యూ కాదా”అన్నాడు రామ్.. “ఎలా ఇష్యూ ,,ఇండియా మొత్తం మాదే అంటుంది….పాక్ ఏమో అజాద్ కాశ్మీర్ అంటుంది…సరే మొత్తం ఇండియా దే కదా ,,,యుద్దం చేయండి ,,, లాక్కొండి”అంది రజియా దెప్పి పొడుస్తూ.. “మేము యుద్దం చెయ్యము”అన్నాడు రామ్.

“చెయ్యరు,,,నిజం గా కాశ్మీర్ కావాలంటే ఇండియా ఎప్పుడో యుద్దం చేసేది….చెయ్యలేదు….తీర్మానం చేస్తే అయిపోయిందా,,పాకిస్తాన్ తనకి తాను గా అజాద్ కాశ్మీర్ ను ఇండియా కి ఇస్తుందా….ఇవ్వదు…..ఇండియా యుద్దం చెయ్యదు…..వాళ్ళు అజాద్ అంటారు ,,మీరేమో 370 అంటారు….రెండు దేశాలు ప్రజల్ని పిచ్చి వారిని చేస్తున్నాయి…పైగా శిఖరాగ్ర సదస్సు అంటూ నాటకాలు…”అరిచింది రజియా.. పిన్ డ్రాప్ సైలెన్స్… సౌందర్య కూడా షాక్ తినింది….ఆమె కూడా ఇలా ఆలోచన చెయ్యలేదు…. రామ్ తేరుకుని “నిజమే ఇన్నేళ్ళు యుద్దం చేయలేదు,,,ఇప్పుడు అణ్వస్త్రసామర్థ్యం ఇద్దరికీ ఉంది..ఇక యుద్దం కష్టం”ఒప్పుకున్నాడు … “అంటే”అన్నాడు పార్టీ ప్రెసిడెంట్…

“370 రద్దు చేయండి,,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలుపుకుంటే కలుపుకో మనండి….ఇక శిఖరాగ్ర సదస్సు అవసరం లేదు…”అంది రజియా…. రామ్ కుమార్ ఒప్పుకున్నాడు… “అయితే కాశ్మీర్ లో నెట్,టీవీ అన్ని అపెద్దం…పొలిటికల్ లీడర్స్ ను అర్రెస్ట్ చేద్దాం గొడవ లేకుండా”అన్నాడు హోమ్ మంత్రి… “ఎందుకు,ఏదో తప్పు చేస్తున్నట్టు “అంది రజియా..

++++ కొద్ది సేపటి తరువాత మీడియా ముందుకు వెళ్ళింది రజియా “దేశానికి కాశ్మీర్ కి ఒక న్యూస్…. article 370 ను రద్దు చేయాలని పీఎం నిర్ణయం తీసుకున్నారు….దయచేసి కాశ్మీర్ పౌరులు గమనించాలి”అంది .. “అదేమిటి మాడం మి పార్టీ దానికి వ్యతిరేకం కదా”అన్నారు విలేకరులు.. “లేదు,,,కాశ్మీర్ విషయం లో ఇక శిఖరాగ్ర సదస్సు ఉండదు…..అజాద్ కాశ్మీర్ ను పాకిస్తాన్ ఏమి చేసుకుంటుందో దాని ఇష్టం “అంది రజియా.. “దీనికి పాక్ ఒప్పుకుందా”అడిగాడు ఒక విలేకరి.. “దానితో ఎందుకు మాట్లాడాలి,,,పనికి వచ్చే విషయాలు లేకుండా ఎప్పుడు అజాద్ కాశ్మీర్ అంటూ రక్త పాతం సృష్టించారు అందరూ కలిసి ఎంత మంది చనిపోయారు కాశ్మీర్ లో….ఎంత మంది అమ్మాయిలు మాన భంగాలకు గురి అయ్యారు “అంది రజియా…

రజియా టీవీ లో చెప్పింది పాక్ లో పీఎం,ఇంతియాజ్ చూశారు.. “ఈ ముండా నిప్పుల్లో నీళ్ళు పోస్తోంది ” అరిచాడు ఇంతియాజ్.. పాక్ పీఎం ఆలోచిస్తూ “అజాద్ కాశ్మీర్ ఇక పాక్ ఇష్టం అంటోంది కదా,,,మనకి మంచిదే కదా”అన్నాడు ఓరగా ఆర్మీ జెనరల్ ను చూస్తూ… ఆయన మొహం ఎర్రగా కందిపోయింది… “సో ఇక శిఖరాగ్ర సదస్సు లేదు,, కాశ్మీర్ ఇష్యూ లేదు,,,ఇండియా తో యుద్దం లేదు…bombshell లేదు…”అన్నాడు పీఎం రిలీఫ్ గా…ఇంతియాజ్ తల వంచుకుని “దీన్ని అనవసరం గా ఈ పనిలో దింపాను”అనుకున్నాడు విచారం గా… ++++ సౌందర్య ,మిగతా అధికారులు మాప్ తీసుకుని పీఎం కి ఎక్స్ప్లెయిన్ చేశారు… “సార్ ఇది బోర్డర్ అరియా…పాక్ ,చైనా రెండు పక్కనే ఉంటాయి.. ఇక కొండకి ఒక వైపు జమ్ము ,ఒక వైపు కాశ్మీర్,మూడో వైపు లాడక్…. So దీన్ని రెండు భాగాలు చేయాలి,,సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంచాలి”అన్నారు… రామ్ కుమార్ ఒప్పుకున్నారు….

మర్నాడు పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశ పెట్టారు పీఎం..”370 కి కాలం చెల్లింది….ఎవరైనా అక్కడ భూమి కొనవచ్చు… వ్యాపారం చేయవచ్చు…ఐపిసి ప్రకారం చట్టం పని చేస్తుంది లదక్ ను జమ్ము నుండి వేరు చేస్తున్నాము…రెండు ఇక నుండి కేంద్రం కింద యూనియన్ territories గ ఉంటాయి “అని చెప్పారు… భారతీయ ప్రజా పార్టీ మద్దతు ఇవ్వడం తో 370 రద్దు జరిగింది.. పార్లమెంట్ బయటకు వచ్చి “సౌత్ లో సమస్య, నార్త్ లో సమస్య ఒకేసారి పరిష్కారం అయ్యాయి “అని చెప్పారు పీఎం రామ్ కుమార్… +++++ అదే సమయంలో తన స్టాఫ్ కి డబ్బు ఇచ్చి థాంక్స్ చెప్పింది రజియా..”ఇక మీరు వెళ్ళొచ్చు”అంది.. సుమతి కి”నువ్వు తారిక్ తో కలిసి సౌందర్య ను కలువు ,నేను చెప్పాను”అంటూ ఇద్దరికీ రెండు బ్యాగ్స్ ఇచ్చింది రజియా..

“ఇంటి తాళం ఒకటి నీ వద్ద ఉంచు “అని ఇచ్చింది సుమతి కి… బ్యాగ్స్ లో ఉన్న డబ్బు చూసి సుమతి కి , తరిక్ కి అర్ధం అయింది… సుమతి కార్ లో సౌందర్య ను కలిసింది…ఆమె తో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్ళారు… “రజియా తప్పుకుంది ,పీఎం ఇంకా పార్లమెంట్ లోనే ఉన్నారు “అంది సుమతి.. “Sorry madam”అన్నాడు తారిక్… విద్య శర్మ సౌందర్య కు , పీడీ గారికి థాంక్స్ చెప్పి కార్ ఎక్కింది…. ఆ కార్ అరగంట లో పీఎం రెసిడెన్స్ కి చేరుకుంది…విద్య శర్మ ఇంట్లోకి అడుగు పెట్టింది….సంతోషం గా… “రజియా సుల్తానా ను కలవాలని ఉంది సుమతి”అంది కూర్చుంటూ.. “ఆమె కి మిమ్మల్ని కలవడానికి సిగ్గు గా ఉంది”అంది సుమతి.. గంట తర్వాత వచ్చిన రామ్ కు ఎదురు వెళ్లి గట్టిగ హత్తుకుని ఏడ్చేసింది విద్య శర్మ.. “ఇదేమిటి ఏదో రెండు మూడు నెలలు దూరం గా ఉన్నట్టు “అన్నాడు రామ్..

కాసేపటికి తేరుకున్న విద్య శర్మ జరిగింది మొత్తం చెప్పింది….వింటున్న రామ్ కుమార్ కి వళ్లు జలదరించి “అంటే ఆమె వేరా ,,ఇది దేశ ద్రోహం “అన్నాడు కోపంగా.. “ప్లీజ్ రామ్ ఆమె మీకు ,దేశానికి మంచి చేసింది ,, నాకు ఆమె మీద కోపం లేదు”అంది…కానీ పీఎం తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టింది…. ++++++ సుమతి కి ఇల్లు అప్పగించాక ముందే సౌందర్య,నేను ఏర్పాటు చేసిన luxury flat లో కి మారింది రజియా.. నేను,సౌందర్య ఆమెని కలిసాము”థాంక్స్ ,బట్ నేను ఇక మి దేశం లో ఉండలేను “అంది రజియా.. “మీలాంటి నటి నీ నేను చూడలేదు…మీరు దేశం నుండి బయటకు వెళ్లడానికి కొంచెం టైమ్ పడుతుంది…మిమ్మల్ని ఎవరు బందించలేదు….మీరు ఫ్రీ గా ఢిల్లీ ఏమిటి.దేశం మొత్తం చూడండి…కాకపోతే స్కార్ఫ్ చుట్టుకొండి “అన్నాను..

+++++ అయితే ఇంతియాజ్ కి తెలియదు…విద్య శర్మ పీఎం వద్దకు వెళ్ళింది అని….రజియా సుల్తానా బయటకి వచ్చేసింది అని…. కొద్ది కాలానికి అజాద్ కాశ్మీర్ ను పాక్ తన దేశం లో కలిపేసుకుంటే ఇండియా మాట్లాడలేదు… ++++++ రక్త పాతం సృష్టించాలని ఇండియా వచ్చిన బాంబ్ షెల్ ,,పూల వర్షం కురిపించింది… The end…..